న్యూఢిల్లీ: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసిస్తున్న గదర్-2 హిందీ చిత్రాన్ని కొత్త పార్లమెంట్ భవనంలో ప్రదర్శించారు. సన్నీడియోల్, అమీషా పటేల్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ దేశభక్తి చిత్రం ఊహించని ఘన విజయం సాధించి రూ.400 కోట్ల క్లబ్లోకి చేరుకుంది.
ఈ చిత్రాన్ని లోక్సభ సభ్యుల కోసం తొలిసారిగా పార్లమెంట్ నూతన భవనంలో ఉదయం 11 గంటలకు ప్రదర్శించారు. ప్రతిరోజు ఐదు షోల వంతున మూడు రోజుల పాటు వేస్తారు. చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల దర్శకుడు అనీల్ శర్మ సంతోషాన్ని వ్యక్తం చేశారు.