భువనేశ్వర్: ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరో అద్భుత కళాఖండాన్ని సృష్టించారు. దేశప్రజలకు ఆలోచింపజేసే సందేశంతో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ 4045 దీపాంతలతో కాళీమాత (Goddess Kali) సైకతశిల్పాన్ని తయారుచేశారు. వెలుగుల పండుగ వేళ మనలోని అన్ని ప్రతికూలతలను కాల్చివేద్దామని, దీపావళికి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని, కాలుష్య రహితంగా వెలుగుల పండుగను జరుపుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఐదు గంటలపాటు శ్రమించి ఆరు టన్నుల ఇసుకతో కాళీ మాత సైకత శిల్పాన్ని రూపొందించారు. మొత్తం 4045 దీపాంతలతో ఐదు ఫీట్ల విగ్రహాన్ని కలర్ఫుల్గా తయారుచేశారు. తన ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఆయనకు సహాయం చేశారు.