న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 3న చెన్నైలో జరిగే సమావేశానికి రావాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ విపక్షాలను ఆహ్వానించారు. కాంగ్రెస్ సహా 20 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుతోపాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.