నాగ్పూర్: స్పైస్జెట్ (SpiceJet) విమానం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి ముంబై వెళ్తున్నది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నాగ్పూర్ విమానాశ్రాయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భవతి కళ్లుతిరిగి పడిపోయింది. దీంతో ఆమెకు చికిత్స కోసం విమానాన్ని మధ్యలోనే కిందికి దించారు.
ముంబై వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం గోరఖ్ఫూర్లో శనివారం మధ్యాహ్నం బయల్దేరింది. అందులో సిబ్బంది సహా సిబ్బంది సహా 182 ప్రయాణికులు ఉన్నారు. వారో మూడు నెలల గర్భవతి కూడా ఉన్నది. విమానం పైకి ఎగిరిన తర్వాత ఆమెకు వాంతులు, కళ్లు తిరడంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నది. దీంతో విమాన సిబ్బంది మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగారు.
ఈ క్రమంలో నాగ్పూర్ విమానాశ్రయ సిబ్బంది ల్యాండింగ్కు అనుమతించారు. 12.32 గంటలకు నాగ్పూర్లో విమానం అత్యవసరంగా దింగింది. ఆమెను హుటాహుటిని సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారని ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ సునీల్ సంగోలే తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, చికిత్స అనంతరం నాగ్పూర్లోని వారి బంధువుల ఇంటికి వెళ్లిందని చెప్పారు. కాగా, ఆ విమానం సాయంత్రం 5.17 గంటలకు ముంబైకి చేరుకుందని వెల్లడించారు.