జైపూర్: రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులపైకి వాహనం దూసుకెళ్లింది. (SUV Rams Into Pedestrians) డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ వాహనం బొల్తాపడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి వేళ ఒక మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు జోధ్పూర్లోని పాల్ రోడ్డు దాటసాగారు. వారు ఆ రోడ్డుకు మరోవైపునకు చేరుకుంటుండగా వేగంగా వచ్చిన ఎస్యూవీ ఢీకొట్టింది. దీంతో ఎగిరి రోడ్డుపై పడ్డారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఎస్యూవీ పల్టీకొట్టింది. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
@CP_Jodhpur कृपया मामले का संज्ञान लेकर आवश्यक कार्यवाही सुनिश्चित करें।
— Rajasthan Police HelpDesk (@RajPoliceHelp) January 10, 2024