చండీగఢ్, ఏప్రిల్ 11: సినీ నటుడు సోనూసూద్ను పంజాబ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కరోనా టీకా వేయించుకునేలా ప్రజల్లో సోనూ సూద్ స్ఫూర్తి నింపగలరని ఆయన అన్నారు.