Sonia Gandhi | సీడబ్ల్యూసీ సమావేశం కోరితే తాము పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పినట్లు సమాచారం. కానీ ఆమె ప్రతిపాదనను సమావేశం తిరస్కరించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత జైపూర్లో చింతన్ శిబిర్ నిర్వహించాలని తీర్మానించామన్నారు.
పార్టీ వ్యూహాల్లో లోపాల వల్లే ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేకపోయామని వేణుగోపాల్ చెప్పారు. జైపూర్లో జరిగే చింతన్ శిబిర్లో పార్టీ వరుస పరాజయాలపై చర్చిస్తామన్నారు. పార్టీలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చింతన్ శిబిర్లో చర్చిస్తామని తెలిపారు.