న్యూఢిల్లీ, జూలై 13: ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సొంతంగా ప్రారంభించిన నథింగ్ స్మార్ట్ఫోన్ వివాదంలో నిలిచింది. ఈ ఫోన్ను బాయ్కాట్ చేయాలని దక్షిణ భారతదేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్విట్టర్లోనైతే #డియర్నథింగ్ అన్న హ్యాష్ట్యాగ్ టాప్ ట్రెండింగ్లో నిలిచింది. వివరాల్లోకెళితే.. నథింగ్ సంస్థ మంగళవారం ఫోన్ (1)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ రివ్యూను ఓ తెలుగు టెక్ యూట్యూబ్ క్రియేటర్ యూట్యూబ్లో విడుదల చేశాడు. ఆ వీడియోలో.. ఫోన్ను అన్బాక్సింగ్ చేసి చూడగా.. హాయ్! దిస్ డివైజ్ ఈజ్ నాట్ ఫర్ సౌతిండియన్ పీపుల్ అని ఓ కాగితంపై రాసి ఉంది.
ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు నథింగ్ ఫోన్ (1) రివ్యూ ఇవ్వలేదని విమర్శిస్తూ వీడియోను తయారుచేశాడు. రివ్యూ యూనిట్లు ఇవ్వటం కంపెనీ బాధ్యత అని గుర్తు చేస్తూ వీడియోను ముగిస్తాడు. అతనితో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్లు కూడా ఇలాగే వీడియోలు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో, కొనుగోలుదారులు కూడా.. #బాయ్కాట్నథింగ్ #డియర్నథింగ్..అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివాదంపై సంస్థ ఇంకా స్పందించలేదు.