న్యూఢిల్లీ: మతం, సిద్ధాంతం పేరుతో కొంతమంది దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘ఆలిండియా సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశంలో శాంతి, సామరస్యాన్ని దెబ్బతీయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. మతం, సిద్ధాంతం పేరుతో చిచ్చుపెడుతున్నారు. ఇలాంటి వాటిని ముక్తకంఠంతో తరిమికొట్టాలి’ అని సూచించారు.