బెంగళూరు: బీజేపీ, జేడీఎస్కు చెందిన కొందరు నేతలు తనతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించనని చెప్పారు. కాంగ్రెస్లో చేరాలంటే తమ పార్టీపై నమ్మకం ఉండాలని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వాన్ని అంగీకరించి మాత్రమే తమతో చేరాలని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్లో చేరాలని వ్యాఖ్యానించారు.
కాగా, చాలా మంది బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సలీమ్ అహ్మద్ కూడా తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎవరి పేర్లను తాము వెల్లడించలేమని చెప్పారు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
మరోవైపు కర్ణాటకలోని అధికార బీజేపీలో మరోసారి సీఎం మార్పు మాట వినిపిస్తున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైపైనా పార్టీ నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికలకు ముందుకు సీఎంను మార్చాలని బీజేపీ భావిస్తున్నది. దీనికి ముందుగా మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు. జేడీఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.