పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించే వారంతా మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని బుధవారం అన్నారు. మహాత్మ గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించేవారని, తన సిద్ధాంతాలకు భిన్నంగా ఉండే వారిని మహా పాపులని పిలిచేవారని నితీశ్ గుర్తు చేశారు. కల్తీ మద్యం సేవించి మరణిస్తే ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోదని తేల్చి చెప్పారు. మద్యం తాగితే ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా ప్రజలు అటు వైపు వెళ్తున్నారని అన్నారు. కాబట్టి, వాటి వల్ల తలెత్తే పరిణామాలకు వారే బాధ్యత వహించాలని నితీశ్ స్పష్టం చేశారు.
కాగా, బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శుక్రవారం దీనిపై స్పందించారు. మద్యం సేవించే సైనికులు కూడా మహా పాపులని, భారతీయులు కాదని సీఎం నితీశ్ భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. నితీశ్ లాజిక్ ప్రకారం ప్రత్యర్థుల రక్తం కళ్ల చూసే నేరస్తులు, అవినీతిపరులు మహాపాపులు కాదు. కానీ మద్యం సేవించేవారు పాపులు, సైనికులు కూడా భారతీయులు కాదు అని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
शराब पीने वाला महाअयोग्य और महापापी है। शराब पीने वाला हिंदुस्तानी नहीं-श्री नीतीश कुमार
नीतीश जी के इस तर्क से तो शराब पीने वाले भारतीय सैनिक भी हिंदुस्तानी नहीं हुए।
बिहार में खून की नदियाँ बहाने वाले दुर्दांत अपराधी एवं भ्रष्टाचारी महाअयोग्य और महापापी नहीं है लेकिन शराबी है pic.twitter.com/HR7IgToEMo
— Tejashwi Yadav (@yadavtejashwi) April 1, 2022