బెంగళూరు: సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన మిషన్ ఆదిత్య-ఎల్1 (Aditya-L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భూమికి (Earth) గుడ్బై చెప్పిన ఆదిత్య-ఎల్1 సూర్యుని (Sun) దిశగా ప్రయాణం ప్రారంభించింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ (Spacecraft) కక్ష్యను పెంచి ఆదిత్యుని దిశగా ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్-1 (Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో ఇస్రో పోస్ట్ చేసింది. భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
ప్రస్తుతం వాహక నౌక లగ్రాంజ్ పాయింట్-1 దిశగా (L1 Lagrange point) దూసుకెళ్తున్నది. ఉపగ్రహ భూకక్ష్యను ఇప్పటికే నాలుగుసార్లు పెంచిన విషయం తెలిసిందే. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-ఎల్1ను మరొక విన్యాసంతో ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. కాగా, ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో ఆదిత్య ఎల్1 తొలి లగ్రాంజ్ పాయింట్కు వెళ్తున్నది. ఇది భూమితోపాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. కాబట్టి ఆదిత్యుడి పరిశీలనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికి వీలుంటుంది. ఈ కేంద్రం నుంచే ఆదిత్య ఎల్1 సూర్యుడిపై అధ్యయనాలు చేస్తుంది.
ఈ నెల 2 ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ (PSLV-C57) ద్వార ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మరుసటి రోజే మొదటి కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ తరఫున సూర్యుడి అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్ ఇదే కావడం విశేషం.
Aditya-L1 Mission | Off to Sun-Earth L1 point | The Trans-Lagrangean Point 1 Insertion (TL1I) manoeuvre is performed successfully. The spacecraft is now on a trajectory that will take it to the Sun-Earth L1 point. It will be injected into an orbit around L1 through a manoeuvre… pic.twitter.com/UNJajadXsQ
— ANI (@ANI) September 18, 2023