కాన్పూర్: 90 సెకండ్లలోనే భూసార పరీక్షను నిర్వహించే పోర్టబుల్ టెస్టింగ్ డివైజ్ను ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. పరీక్షకు 5 గ్రాముల మట్టి సరిపోతుందన్నారు. ‘భూ పరీక్షక్’ పేరుతో అభివృద్ధి చేసిన యాప్ ద్వారా బ్లూటూత్ సాయంతో భూసారం ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మట్టిలో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, కార్బన్ వంటి పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతతో తయారుచేసిన ఈ పరికరం కచ్చితంగా చెబుతుందని వెల్లడించారు. ఒక్క పరికరంతో లక్ష దాకా నమూనాలను పరీక్షించవచ్చని చెప్పారు. ప్రస్తుతం భూసార పరీక్షల కోసం 15 రోజులపాటు ఎదురు చూడాలి.