పుణే: ప్రముఖ సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత్రి గేల్ ఆమ్వెట్ (81) మహారాష్ట్రలోని స్వస్థలమైన కాసేగావ్లో దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. భారత్లోని అనేక సామాజిక ఉద్యమాలపై చెరగని ముద్రవేసిన గేల్ అమెరికాలోని మినియాపోలిస్ నగరంలో జన్మించారు. భారత్లోని కులవ్యవస్థను అధ్యయనం చేయడానికి, ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా ఫులేపై పరిశోధన చేయడానికి ఆమె భారత్ వచ్చారు. ఫులే మహారాష్ట్రలో నడిపిన బహుజన ఉద్యమంపై పీహెచ్డీ విద్యార్థిగా ఆమె పరిశోధన చేశారు. ఆమె పీహెచ్డీ గ్రంథం ద్వారానే ఫులే సత్యశోధక్ సమాజ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసివచ్చింది. మార్క్సిస్టు పండితుడు, సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్ను గేల్ వివాహమాడి మనదేశంలో స్థిరపడ్డారు. పుణే యూనివర్సిటీ సామాజిక శాస్ర్తాల విభాగంలో ఆమె ఫులే-అంబేద్కర్ పీఠం చైర్పర్సన్గా పనిచేశారు. ఐక్యరాజ్యసమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా పనిచేశారు. 1980లలో ఆమ్వెట్-పటాంకర్ దంపతులు శ్రామిక్ ముక్తి దళ్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే ఆమె భారత పౌరసత్వం స్వీకరించారు. గేల్ ఆమ్వెట్ మృతిపై పలువురు ప్రముఖులు, సంస్థలు సంతాపం ప్రకటించారు.