న్యూఢిల్లీ : ఫోన్కు చార్జింగ్ పెట్టి నిద్రపోయే అలవాటుందా? అయితే మీరు ప్రమాదపుటంచుల్లో ఉన్నారు. ప్రత్యేకించి ఐఫోన్ యూజర్లు ఈ పనులు చేయకూడదని యాపిల్ కంపెనీ హెచ్చరించింది. ఫోన్కు చార్జింగ్ పెట్టి మంచంపై ఉంచి నిద్రపోవడం ప్రమాదకరమని ఆ కంపెనీ తన యూజర్లను హెచ్చరించింది. షాక్ కొట్టడం, మంటలు అంటుకోవడం తదితర ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని తెలిపింది. కవర్లతో కప్పి ఉంచిన ఫోన్ను రాత్రంతా చార్జింగ్ పెట్టి ఉంచడం ప్రమాదకరమని పేర్కొంది. సరైన గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో చార్జింగ్ పెట్టాలని సూచించింది. ‘దిండు కింద, బ్లాంకెట్లలో పెట్టవద్దు. గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో చార్జింగ్ పెట్టండి’ అని యాపిల్ కంపెనీ సూచించింది.