హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఫ్రాన్స్కు చెందిన ప్రొమెథీ కంపెనీతో కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ పని చేయనున్నదని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పవన్కుమార్ చందన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దేశంలో ప్రైవేటు ఏరోస్పేస్ రంగంలో విక్రమ్ రాకెట్ లాంచర్ ద్వారా విజయవంతమైన సేవలను అందిస్తున్న స్కైరూట్తో ఫ్రాన్స్కు చెందిన ప్రొమెథీ కలిసి పని చేయనున్నదని చెప్పారు. ఫ్రాన్స్లో జెప్టస్ ఎర్త్ అబ్జర్వేషన్ పేరుతో చేపట్టే అంతరిక్ష ప్రయోగంపై కలిసి పని చేసేందుకు ప్రొమెథీ సంస్థకు చెందిన అధ్యక్షుడు ఆలివర్ పీప్జ్తో చర్చలు జరిపినట్టు తెలిపారు.