న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ స్కైరూట్ మరో మైలురాయిని సాధించింది. తమ 3డీ ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ ధావన్-2 లాంగ్ డ్యూరేషన్ టెస్ట్ను విజయవంతంగా పరీక్షించింది. గత ఏడాది నవంబర్లో ‘విక్రమ్-ఎస్’ ప్రయోగం ద్వారా దేశంలో రాకెట్ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.