న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన అమర జవాను, సియాచిన్ హీరో లాన్స్నాయక్ చంద్రశేఖర్ గుర్తులు 38 ఏండ్ల తర్వాత బయటపడ్డాయి. సియాచిన్ గ్లేసియర్లో సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఆయన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. మెడలో ఉన్న లాకెట్, దానిపై ఉన్న ఆర్మీ నంబర్ ఆధారంగా అధికారులు శనివారం చంద్రశేఖర్గా గుర్తించారు.
సియాచిన్ గ్లేసియర్ను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు 1984లో భారత్ చేపట్టిన ఆపరేషన్ మేఘదూత్లో చంద్రశేఖర్ పాలుపంచుకొన్నారు. ఓరోజు సంభవించిన హిమపాతంలో 19 మంది జవాన్లు మరణించారు. 14 మంది మృతదేహాలు మాత్రమే లభ్యం కాగా, ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో చంద్రశేఖర్ ఒకరు.