సియెర్రా లియోన్, నవంబర్ 26: సియోర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్పై సాయుధులైన తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు. దేశ ప్రధాన మిలటరీ బ్యారెక్లు, నిర్బంధ కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసి వాటిలో బందీలుగా ఉన్న కొందరిని విడుదల చేయగా, మరికొందరిని అపహరించుకుని పోయారు. పడెంబా రోడ్ ప్రిజన్స్ సహా పలు కారాగారాల్లో రెండు వేల మందికి పైగా నిర్బంధంలో ఉన్నారు. ఈ దాడిలో సాయుధ తిరుగుబాటుదారులు చాలామందిని అపహరించుకుపోగా, మరికొందరు పరారయ్యారు. చాలామందిని భద్రతా బలగాలు రాజధాని శివారు, ఇతర ప్రాంతాల్లో తిరిగి అదుపులోకి తీసుకున్నట్టు ఆ దేశ సమాచార శాఖ మంత్రి చెర్నోర్ బా తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జూలియస్ మాడా బియో ప్రకటించారు.