Sidhu Moose Wala | కాంగ్రెస్ నాయకుడు, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్.. 58 ఏండ్ల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిద్ధూ మూసేవాలా 2022, మే 29వ తేదీన దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మన్సా జిల్లాలోని జవహర్కే గ్రామం వద్ద మూసేవాలా కారును అడ్డుకున్న దుండగులు.. అనంతరం అతన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. అప్పుడు సిద్ధూ వయసు కేవలం 28 ఏండ్లు మాత్రమే. అయితే చరణ్ కౌర్, బాల్ కౌర్ సింగ్(60) దంపతులకు సిద్ధూ మూసేవాలా ఒక్కరే సంతానం.
ఇక సిద్ధూ హత్యకు గురైన నేపథ్యంలో మరో బిడ్డను కనాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు తెలిపారు. మార్చిలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు.
సిద్ధూ మూసేవాలాగా పేరొందిన శుభ్దీప్ సింగ్ సిద్ధూ.. 2021 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పాటిన బంబిహ బోలే, 47 పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి చిత్రాల్లోనూ నటించారు. త్వరలోనే జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సిద్ధూ తండ్రి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.