న్యూఢిల్లీ : కర్నాటక తదుపరి సీఎం (Karnataka CM) ఎవరనే ఉత్కంఠకు తెరపడలేదు. సీఎం పదవికి మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పోటీ పడుతుండటంలో కాంగ్రెస్ హైకమాండ్ వీరిద్దరిలో ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఎక్కువ మంది పార్టీ ఎమ్మెల్యేలు కర్నాటక సీఎంగా తననే కోరుకుంటున్నారని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్నాటక సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయనతో వ్యక్తిగత సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సిద్ధరామయ్య చెప్పారు.మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కాగా, కర్నాటక సీఎం వ్యవహారంపై పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ఆయన ఢిల్లీ పయనమయ్యారు.
ఇక సీఎం పదవిని చెరి రెండున్నరేండ్లు పంచుకోవాలనే ప్రతిపాదనను డీకే శివకుమార్ తోసిపుచ్చినట్టు సమాచారం. వయో భారం కారణంగా ముందుగా తాను రెండేండ్లు సీఎం పదవిని చేపడతానని, ఆపై మూడేండ్లు డీకే శివకుమార్ చివరి మూడేండ్లు సీఎంగా కొనసాగాలని సిద్ధరామయ్య సూచించారు. లోక్సభ ఎన్నికల వరకూ తాను సీఎంగా ఉంటానని ఆయన ప్రతిపాదించగా డీకే శివకుమార్ అందుకు విముఖత వక్తం చేశారు. రాజస్ధాన్, చత్తీస్ఘఢ్ ఉదంతాలను ఉటంకిస్తూ డీకే ఈ ప్రతిపాదనను తోసిపుచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కర్నాటక సీఎంను ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు కట్టబెడుతూ సీఎల్పీ సమావేశం నిర్ణయించడంతో కర్నాటకం ఢిల్లీకి చేరింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 135 స్ధానాల్లో గెలుపొందగా పాలక బీజేపీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. జేడీఎస్ 19 స్ధానాల్లో విజయం సాధించింది.
Read More
Karnataka CM | కర్ణాటక సీఎం పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఢిల్లీకి బయలుదేరిన మాజీ సీఎం సిద్ధరామయ్య