న్యూఢిల్లీ, జనవరి 7: బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్, శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే సహా ఐదుగురు లోక్సభ సభ్యులు ఈ ఏడాది సంసద్త్న్ర అవార్డులకు ఎంపికయ్యారు. మిగిలిన వారిలో బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, ఎన్సీపీ ఎంపీ అమోల్ రాంసింగ్ కొల్హే, కాంగ్రెస్ ఎంపీ రాజ్ శర్మ ఉన్నట్టు అవార్డు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. రాజధానిలో ఫిబ్రవరి 17న నిర్వహించే కార్యక్రమంలో వీరికి బహుమతులు అందజేస్తామని వారు చెప్పారు. జ్యూరీ కమిటీ మెంబర్స్ బృందం ఎంపీల సమగ్ర పనితీరును పరిశీలించి పార్లమెంట్లో ప్రతిభ కనబర్చిన సభ్యులను ప్రతి ఏడాది ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అలాగే లోక్సభ కాలపరిమితి ఐదేండ్ల పాటు స్థిరమైన ప్రజ్ఞను ప్రదర్శించిన సభ్యునికి సంసద్ మహారత్న అవార్డు అందజేస్తారు. చెన్నైకు చెందిన లాభేతర సంస్థ ప్రైమ్ ఫౌండేషన్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010లో ఆయన చేతుల మీదుగానే ఈ అవార్డులను ప్రారంభించింది.