DK Shivakumar | దేవనగెరె, అక్టోబర్ 27: మరో రెండున్నరేండ్ల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూర్చుంటారని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ ‘రెండున్నర సంవత్సరాల తర్వాత శివకుమార్ సీఎం అవుతారు.
ఇందులో రెండో మాటకు తావులేదు. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు’ అని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన ఓ గుంపు.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, మంత్రి పదవి ఆశచూపుతున్నదని తెలిపారు.