ముంబై:సీఎం ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని, షిండే వర్గంలోని 22మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ‘సామ్నా’ పత్రిక మంగళవారం నాటి ఎడిటోరియల్లో ప్రచురించింది. ఇదే అంశంపై సంజయ్ రౌత్ మరోమారు వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. షిండే వర్గం ఎమ్మెల్యేలు తమతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నార ని, వారంతా చాలా అసంతృప్తితో ఉన్నారని రౌత్ పేర్కొన్నారు.