శ్రీనగర్, మే 24: జమ్ముకశ్మీర్లో షేక్ అబ్దుల్లా పేరుతో అందజేసే పోలీస్ మెడల్ను ప్రభుత్వం రద్దుచేసింది. 1947లో పాకిస్థానీ సైన్యం దన్నుతో అక్కడి గిరిజనులు జమ్ముకశ్మీర్పై దాడిచేయగా షేక్ అబ్దుల్లా నేతృత్వం లో వారిని తరిమికొట్టారు. అందుకు గుర్తుగా ‘షేర్-ఎ-కశ్మీర్’ పేరుతో విశేష సేవలందించిన పోలీసులకు షేక్అబ్దుల్లా చిత్రంతో ఉండే పోలీస్ మెడల్ ప్రదానం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం మెడల్ పేరును జమ్ముకశ్మీర్ పోలీస్ మెడల్ గా మార్చింది. షేక్ అబ్దుల్లా చిత్రా న్ని తొలగించి జాతీయ చిహ్నాన్ని చేర్చింది. దీనిపై షేక్ అబ్దుల్లా స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్తోపాటు స్థానిక రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. జమ్ముకశ్మీర్ చరిత్రను బీజేపీ తిరగరాయాలని చూస్తున్నదని దుయ్యబట్టాయి.