బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తృణమూల్ అభ్యర్థిని ప్రకటించారు. నటుడు నుంచి రాజకీయ నేతగా ఎదిగిన శత్రుఘ్న సిన్హాను తృణమూల్ అభ్యర్థిగా అసన్సోల్ నుంచి బరిలోకి దింపుతున్నామని సీఎం మమత ప్రకటించారు. ఇక… బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను తృణమూల్ అభ్యర్థిగా బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నామని మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
అసన్సోల్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా తృణమూల్ తరపున కేంద్ర మాజీ మంత్రి, నటుడు శత్రుఘ్న సిన్హాను పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నాము. ఈ విషయం ప్రకటించడం ఎంతో హర్షనీయం. బాలిగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము. జై హింద్, జై బంగ్లా.. జై మాటీ మానుష్ అంటూ మమత ట్వీట్ చేశారు.