ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మంగళవారం సమావేశమయ్యారు. సీఎం ఠాక్రే సొంత నివాసం వర్షలో వీరి భేటీ జరిగింది. 35 ఏండ్ల తన మిత్ర పక్షం బీజేపీతో శివసేన జట్టు కట్టనున్నదని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో పవార్, ఠాక్రే భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జితేంద్ర అవధ్, దిలీప్ వాల్సే పాటిల్, ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూటమి చీలిపోతుందని, బీజేపీతో శివసేన తిరిగి జట్టు కడుతుందన్న పుకార్లు వ్యాపించాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పవార్.. అధికార మహారాష్ట్ర వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమి, మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ వ్యవహారం చర్చకు వచ్చినట్లు తెలిసింది.
శివసేన ఎక్స్పైరీ డేట్ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ నేత నానా పటోల్ వ్యాఖ్యానించారు.మరోవైపు శివసేన కూటమిలో ఐక్యత పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నది.