ముంబై : డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడికి బెయిల్ను తిరస్కరించారు. క్రూయిజ్ షిప్ పార్టీ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఇవాళ నార్కోటిక్స్ ఏజెన్సీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం వరకు ఆర్యన్ వారి కస్టడీలో ఉండనున్నారు. ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఆర్యన్కు కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్యన్తో పాటు అర్బాజ్ సేత్ మెర్చంట్, మున్మున్ ధమెచాలను ఎన్సీబీ అక్టోబర్ ఏడవ తేదీ వరకు తమ కస్టడీలో ఉంచనున్నది. ఎన్సీబీ కస్టడీకి జడ్జి ఆదేశించడంతో.. ఆర్యన్ కన్నీటిపర్యంతమయ్యాడు.
ఆదివారం క్రూయిజ్ షిప్లో వెళ్లిన కొందరు.. వాళ్లు ధరించిన దుస్తులు, అండర్గార్మెంట్స్, పర్సుల్లో డ్రగ్స్ను దాచినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి గోవాకు వెళ్తున్న షిప్లోకి మారువేశాల్లో వెళ్లిన ఎన్సీబీ పోలీసులు.. డ్రగ్స్ తీసుకుంటున్నవారిని అరెస్టు చేశారు. ఆ జాబితాలో ఆర్యన్తో పాటు మరో ఏడు మంది ఉన్నారు. ముంబై నుంచి షిప్ బయలుదేరిన తర్వాత పార్టీ స్టార్ట్ అయినట్లు అధికారులు చెప్పారు.
క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ నిర్వహించిన దాడిలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 ఎండీఎంఏ పిల్స్, 5 గ్రాముల ఎండీని గుర్తించారు. డ్రగ్స్ను కొనడం, డ్రగ్స్ను కలిగి ఉండడం, నిషేధి ఉత్ప్రేరకాలను వాడడం వంటి కేసులను ఆర్యన్పై నమోదు చేశారు. అంతర్జాతీయ డ్రగ్ కార్టల్స్తో ఆర్యన్కు లింకు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్టోబర్ 11 వరకు ఆర్యన్ను తమకు అప్పగించాలని ఎన్సీబీ కోర్టులో కోరింది.