Lakhimpur Violence | లఖింపూర్ ఖేరి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 19 సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆశిష్ మిశ్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిశ్రాకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో 208 మంది సాక్షులు ఉన్నందున, విచారణ పూర్తి కావడానికి ఐదేళ్లు పడుతుందని అదనపు సెషన్స్ జడ్జి ఇచ్చిన కేసు నివేదికను కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. ఇతర కేసులను ప్రభావితం చేయకుండా ఈ కేసును ఏ సమయంలో పరిష్కరించాలని కోర్టును కోరింది.
మరో వైపు హింసాకాండకు పాల్పడిన నిందితులందరిపై అభియోగాలను నమోదు చేసినట్లు యూపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. 2021, అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆందోళన సమయంలో కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా ఎస్యూవీ రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఆందోళన ప్రతిపక్ష పార్టీలు, రైతుసంఘాలు ఆందోళన నిర్వహించాయి.