బెంగళూరు: ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప మంగళవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
ఈ మేరకు పార్టీ జాతీయాధ్యకుడికి లేఖ రాశారు. ఈశ్వరప్ప తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆజాన్పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.