లక్నో: నవ వధువుపై ఆమె ప్రియుడు దాడి చేశాడు. బ్లేడ్తో ఆమె గొంతు కోశాడు. ఆమె తనకు దక్కకపోతే మరెవరికీ దక్కనీయనని హెచ్చరించాడు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక యువతికి ఈ నెల 17న వివాహమైంది. దీనిపై ఆమె ప్రియుడు యాసిన్ ఆగ్రహం చెందాడు. పెళ్లైన రెండు రోజుల తర్వాత ఈ నెల 19న మరో పెళ్లి వేడుకకు వెళ్తున్న ఆ నవ వధువుపై బ్లేడ్తో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా ఆమె గొంతు కోశాడు. ‘నువ్వు నాకు దక్కకపోతే, మరొకరికి దక్కనీయను’ అని హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ నవ వధువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె గొంతు భాగంలో లోతుగా గాయం కావడంతో పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఎలాంటి ఆహారం తీసుకోవద్దని ఆమెకు సూచించారు. మెజిస్ట్రేట్ ఎదుట ఆ మహిళ స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు యాసిన్ గురించి అతడి కుటుంబం, బంధువుల వద్ద ఆరా తీశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.