కోపెన్హాగన్: ప్రమాదాలు, పక్షవాతం వంటి కారణాల వల్ల పనిచేయకుండా స్తంభించిన అవయవాలలో కదలికలు తెచ్చి పూర్వ స్థితిలో పనిచేసేలా డిజిటల్ ఇంప్లాంట్ టెక్నాలజీని సైంటిస్టులు అభివృద్ధి చేశారు. మెట్రో మీడియా కథనం ప్రకారం.. స్విట్జర్లాండ్కు చెందిన ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరల్ డే లాసన్నే(ఈపీఎఫ్ఎల్) శాస్త్రవేత్తలు ‘వైర్లెస్ డిజిటల్ బ్రిడ్టి’ని సృష్టించారు.
ప్రమాదాల కారణంగా వెన్నెముక, మెదడు మధ్య దెబ్బతిన్న సంబంధాన్ని ఇది పునరుద్ధరిస్తుంది. రెండింటి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడంతో మెదడు నుంచి వెన్నెముకకు సందేశాలు వెళ్తాయి. తద్వారా ఆ వ్యక్తి తన కాళ్లను కదపడం, నించోవడం, నడవడం, మెట్లు ఎక్కడం వంటివి చేయగలుగుతున్నాడు. వెన్నెముకకు జరిపే ఈ డిజిటల్ మరమ్మతు వల్ల నూతన నరాల వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందని పరిశోధకులు వెల్లడించారు.