ఈ నెల 16 నుంచి మరింత కోవిడ్ ఆంక్షలను ఎత్తేసింది తమిళనాడు సర్కార్. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2 వరకూ పొడిగించారు. పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలకు 200 మంది మాత్రమే హాజరు కావాలని, అంత్యక్రియలకు 100 మంది మాత్రమే హాజరు కావాలని సూచించారు. థియెటర్లు, హోటళ్లు, మాల్స్, జిమ్స్, లాడ్జీలు, బట్టల దుకాణం, జ్యువెలరీ దుకాణం, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. గతంలో పేర్కొన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన శనివారం అత్యున్నత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆరోగ్య రంగ నిపుణులు కూడా హాజరయ్యారు.