భోపాల్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం సేవించిన మత్తులో స్కూల్కు వచ్చాడు. స్కూల్ మెట్ల వద్ద కూర్చొని మత్తులో జోగాడు. గమనించిన విద్యార్థులు వీడియో రికార్డ్ చేశారు. ఇది వైరల్ కావడంతో ఆ టీచర్ను సస్పెండ్ చేశారు. (school teacher suspended) మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతమ్ మద్యం సేవించాడు. ఆ మత్తులో స్కూల్కు వచ్చాడు. స్కూల్ ఆవరణలోని మెట్ల వద్ద కూర్చొని మత్తులో జోగాడు. కనీసం నిలబడలేదని స్థితిలో ఆ టీచర్ ఉన్నాడు.
కాగా, మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు రాజేంద్రను కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆ టీచర్ గతంలో కూడా పలుమార్లు తాగి స్కూల్కు వచ్చినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఆ టీచర్ తీరు వల్ల కొందరు విద్యార్థులు బడి మానేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడు రాజేంద్రను సస్పెండ్ చేశారు.