చెన్నై: తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా లక్షలాది పోస్టర్లు వెలిశాయి. లోక్సభ మొదటి దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లపై జై పే అని ముద్రించారు. స్కాన్ చేయండి.. స్కామ్లు చూడండి అని కింద ఒక ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే యూజర్లకు ఓ వీడియో కనిపిస్తుంది. అందులో కేంద్రంపై అవినీతి ఆరోపణలను ఎక్కుపెడుతూ ఓ వాయిస్ వినిపిస్తుంది. ఎన్నికల బాండ్లు మొదలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతితో సహా కొంత మంది పారిశ్రామిక వేత్తలకు బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల రుణ మాఫీ చేసిన అంశాలన్నీ వాయిస్ రూపంలో ఉన్నాయి. ఈ పోస్టర్లను డీఎంకే ముద్రించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.