న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్లో ఉన్న సెలూన్కు నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమీషన్ రెండు కోట్ల జరిమానా విధించింది. ఓ లేడీ మోడల్కు సరైన రీతిలో కటింగ్ చేయని కేసులో ఆ ఫైన్ వేశారు. అయితే ఆ జరిమానా సరికాదు అని సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొన్నది. నష్టపరిహారాన్ని అంత ఇవ్వాలని చెప్పడానికి గత కారణాలు ఏంటో వివరించాలని సుప్రీం తన తీర్పులో చెప్పింది. ఈ కేసులో ఎన్సీఆర్డీసీ మరోసారి ఆ మహిళా మోడల్ వద్ద సమాచారాన్ని సేకరించి, ఎందుకు ఆమెకు అంత నష్టపరిహారం ఇవ్వాలో కనుక్కోవాలని సుప్రీం పేర్కొన్నది.
జస్టిస్ అనిరుద్ధ బోస్, విక్రమ్ నాథ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 2018లో ఆష్నా రాయ్ అనే మోడల్.. ఐటీసీ మౌర్యాలో హెయిర్ కట్టింగ్ చేయించుకున్నది. అయితే సరైన రీతిలో సెలూన్ తన శిరోజాలను కట్ చేయలేదని ఆమె ఆరోపించింది. 2021 సెప్టెంబర్లో ఎన్సీడీఆర్సీ ఈ కేసులో సెలూన్కు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నష్టపరిహారం అంత ఇవ్వడానికి గల కారణాలు తమకు కనిపించలేదని సుప్రీం బెంచ్ తన తీర్పులో చెప్పింది.