ముంబై: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజా నివేదిక కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలను టైంబాంబుగా అభివర్ణించిన నివేదిక.. వాటికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. ఉచిత పథకాల ఖర్చును రాష్ట్ర జీడీపీలో ఒక శాతంగా లేదా ప్రభుత్వ సొంత పన్ను రాబడిలో ఒక శాతంగా ఉండేలా పరిమితి విధించాలని సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీకి సూచించింది.
ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య క్రాంతి ఘోష్ ఈ నివేదికను రూపొందించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో వార్షిక పింఛన్ల భారం దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉన్నదని పేర్కొన్నారు. ఆయా రాష్ర్టాల్లో సొంత పన్ను రాబడితో పోలిస్తే ఇది వరుసగా 217 శాతం, 190 శాతం, 207 శాతం ఎక్కువగా ఉన్నదని తెలిపారు. పలు రాష్ర్టాల్లో పాత పెన్షన్ వి ధానానికి మళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాయని, అది మరింత భారం అవుతుందని అంచనా వేసింది.