చెన్నై/న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు కేశవ్ దేశిరాజు (66) ఆదివారం కన్నుమూశారు. సర్వేపల్లి గౌరవార్థం ఆయన జయంతి రోజు జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం నాడే కేశవ్ తుదిశ్వాస విడిచారు. ‘ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్’ కారణంగా ఆయన మరణించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేశవ్ 1978 బ్యాచ్ ఉత్తరాఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఐఏఎస్ అధికారిగానే గాక విద్యావేత్తగా, పరిశోధకుడిగా ఆయనకు మంచి పేరున్నది.