ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రముఖ డిజైనర్ రోహిత్ పిసల్ తయారు చేసిన ఒక చీర ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నది. దీని ధర అక్షరాలా రూ.39 కోట్ల వరకు ఉంటుంది. రమాబాయి అంబేదర్ చిత్రంతో తయారైన ఈ చీరను రమాబాయి అంబేదర్కు ఆమె జయంతి రోజున అంకితం చేశారు.
ఈ ప్రత్యేకమైన చీరను తయారు చేయడానికి దాదాపు మూడు నెలలు పట్టిందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేకమైన ఫాబ్రిక్పై బంగారు పూత పూయడానికి ప్రత్యేక పద్ధతులు, రసాయనాలను ఉపయోగించినట్టు చెప్పారు. చీరలో రూ. 33 కోట్ల విలువైన వజ్రాలు పొదిగారు. రూ.39 కోట్ల విలువైన ఈ చీరను దుబాయ్లో వేలం వేయనున్నారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును సామాజిక సేవ కోసం ఉపయోగిస్తారు.