జైపూర్: ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఒక సాధువుకు కోపం వచ్చింది. దీంతో ఆయన ఒర నుంచి కత్తిని బయటకు తీశారు. వాహనదారులను బెదిరించారు. రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంత్ కుశాల్ గిరి మహారాజ్ తన వాహనంలో ప్రయాణించారు. అయితే జడన్ టోల్ ప్లాజా వద్ద పలు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఆయన ఆగ్రహం పట్టలేకపోయారు. వెంటనే తన కారు నుంచి కిందకు దిగారు. ఒరలోని కత్తిని బయటకు తీశారు. వాహనదారులకు కత్తిని చూపారు. ట్రాఫిక్ క్లియర్ చేయాలంటూ వాహనదారులను ఆయన బెదిరించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధువైన సంత్ కుశాల్ గిరి సహనం కోల్పోయి కత్తితో ప్రజలను బెదిరించడంపై నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.