తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని మాస పూజల కోసం ఈ నెల 17న తెరువనున్నారు. ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. కేరళలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా గరిష్ఠంగా 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్, కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను భక్తులు సమర్పించాల్సి ఉంటుంది.