దేశంలో పెట్రోల్ కొరత రాబోతున్నదన్న వదంతులతో జమ్ములో బంకుల వద్ద ప్రజలు బారులుతీరారు. తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకొనేందుకు వందలాది మంది పెట్రోల్ బంకులకు చేరుకోవడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. లోయ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అయితే దేశంలో పెట్రోల్కు ఎలాంటి కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టతనిచ్చింది.