బీజేపీపాలిత రాష్ట్రాల్లోని రోడ్డన్నీ గుంతలమయమే. దీంతో ఎంతో మంది ప్రాణాలుకోల్పోతున్నారు. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2018 – 2020 మధ్య కాలంలో గుంతల కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల 5,626 మంది మరణించారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2018, 2019, 2020లో గుంతల కారణంగా మొత్తం రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య వరుసగా 2,015, 2,140 , 1,471గా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు వినూత్నరీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ వ్యక్తి యమధర్మరాజు వేషం వేసుకొని, రోడ్డుపై నిరసన తెలిపారు. కొద్దిరోజుల క్రితం బెంగళూరు వ్యక్తి కూడా ఇదే వేషధారణలో తన నిరసనగళం వినిపించాడు. ఈ రోడ్లన్నీ నిజంగా నరకాన్ని తలపిస్తున్నాయని, అందుకే యమధర్మరాజు వేషం వేసుకొని నిరసన తెలుపుతున్నట్లు వారు తెలిపారు. నాగాలాండ్లోని దిమాపూర్లో ముగ్గురు మహిళలు మత్స్యకన్యల్లాగా దుస్తులు ధరించి, రోడ్డుపై గుంతల వద్ద ఫొటోషూట్ నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మహిళలు మాక్ అవుట్డోర్ ఫ్యాషన్ షో నిర్వహించారు. రోడ్డుపై గుంతల వద్ద వారు ర్యాంప్ వాక్చేశారు. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో అనుప్పూర్ను బిజూరి మనేంద్రగఢ్తో కలిపే రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచిపోయాయి. కొంతమంది స్థానికులు ఆ గుంతచుట్టూ కుర్చీలు వేసుకుని పార్టీ చేసుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు.
సురక్షితమైన రోడ్లు కావాలని కోరుతూ మంగళూరులో లిఖిత్రాయ్ అనే యువకుడు ఆగస్ట్ 12న నగర కార్పొరేషన్ భవనం వెలుపల నిరసన తెలిపాడు. అతని నిరసన వెనుక బాధాకరమైన కథ ఉంది. కొంచండి నివాసి అయిన లిఖిత్ రాయ్ స్నేహితుడు అతీష్ ఆగస్టు మొదటి వారంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కండెట్టు సమీపంలోని హైవేపై ఉన్న గుంతను అతీష్ గమనించలేదని, చివరి నిమిషంలో గుంతను తప్పించే ప్రయత్నంలో డివైడర్ను ఢీకొట్టాడని లిఖిత్ తెలిపాడు. మిత్రుడిని కోల్పోయిన బాధను మౌన నిరసన ద్వారా తెలియజేయాలనుకుంటున్నట్లు రాయ్ తెలిపారు. బెంగళూరులోని అంజన్పుర నివాసితులు 2021 సెప్టెంబర్లో నీటితో నిండిన గుంతల్లో వరి నాటు వేశారు. రోడ్లపై ఏర్పడ్డ గుంతలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని, అందుకే ఈ పనిచేసినట్టు వారు పేర్కొన్నారు.
Several women and children of a locality near Hoshangabad Road in #Bhopal, adopted a novel way to draw the attention of the government to the potholed roads in the area. They performed a catwalk on the potholed roads and made the video viral on #socialmedia. pic.twitter.com/ebYrpbOL87
— Siraj Noorani (@sirajnoorani) September 5, 2021