హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): జర్మనీకి చెందిన కీల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు రాతి యుగంలో మనుషులు ఎలాంటి ఆహారం తిన్నారన్న దానిపై పరిశోధనలు చేసి అబ్బురపరిచే విషయాలను కనుగొన్నారు. 5 వేల సంవత్సరాల క్రితం రాతి యుగంలో మనుషులు వైవిధ్యమైన వంటలు వండుకొని తినేవారని, ఇందు కోసం సిరామిక్ పాత్రలను ఉపయోగించినట్లు తెలుసుకున్నారు. వాటిలో కాలిన ఆహార పదార్థాల అవశేషాలు కనుగొన్నారు.
జర్మనీలోని తూర్పు హోల్స్టెయిన్లో ప్రజలు ఆ కాలంలో ఏం తినేవారు? ఎలా తినేవారు? అనే విషయాలపై పరిశోధన చేసి ఆ వివరాలను ప్లాస్ వన్ జర్నల్లో ప్రచురించారు. ఆనాటి ప్రజలు మొక్కల ఆధారిత, వివిధ తృణ ధాన్యాలను ఆహారంగా స్వీకరించారని తెలిసింది.