న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ నియంతృత్వ పోకడను అవలంభిస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ తీరును, మోదీ వైఖరిని ఎండగడుతున్నాయి.
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభించిన వైఖరిపై మండిపడింది. దేశంలో ‘గణతంత్ర రాజ్యం చచ్చిపోయింది’ ‘రాజును భగవంతుడే కాపాడుతాడు’ అని ట్విటర్లో వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. ఈ కామెంట్కు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సెంగోల్ (రాజ దండం) ను పట్టుకుని ఉన్న ఫొటోను జతచేసింది.
The Republic is dead
God save the King. pic.twitter.com/UHTVihZlHd— Mahua Moitra (@MahuaMoitra) May 29, 2023