న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఓబీసీ (ఇతర వెనుకబడిన కులాల) ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన రోహిణి కమిషన్ తన నివేదికను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలో కేంద్రం 2017లో ఓబీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. కేంద్రం లిస్టులోని వివిధ అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ఈ కమిషన్కు అప్పగించారు. అంతేకాకుండా లిస్టులో ఏవైనా అంశాలు పునరావృతం అయితే వాటిని సరిదిద్దడం, అస్పష్టత, వైరుధ్యం, అక్షర దోషాలు, ప్రతిలేఖనము, రిజర్వేషన్లలో అసమానత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓబీసీల్లో చేర్చడానికి గల విధి విధానాలు, లక్షణాలు, పారామితులను శాస్త్రీయ విధానంలో పరిశీలించి నివేదికను అందజేయాలని ఆదేశించారు.