పంచకుల : పిట్బుల్, రోట్వీలర్ బ్రీడ్కు చెందిన డాగ్స్ను పెంచే వ్యక్తులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా పెంచుతున్నట్లు గుర్తిస్తే తొలిసారి రూ.5వేలు, రెండోసారి రూ.10వేలు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
పంచకుల మున్సిపల్ కార్పొరేషన్లో డాగ్స్ స్టెరిలైజేషన్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ కులభూషణ్ గోయల్ తెలిపారు. పిట్బుల్, రోట్వీలర్ బ్రీడ్ కుక్కలను పెంచే యజమానులు అక్టోబర్ 31 వరకు కార్పొరేషన్లో నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్కు అనుమతి లేదని స్పష్టం చేశారు.
రెండు బ్రీడ్ డాగ్స్ను బయటకు తీసుకువెళ్లే సమయంలో మెడలో టోకెన్ ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. అలాగే వీధికుక్కలను స్టెరిలైజేషన్ త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చామని, తద్వారా వాటి సంఖ్య తగ్గుతుందన్నారు. అయితే, కుక్కకాటు కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పంచకుల కార్పొరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.