న్యూఢిల్లీ: రస్నా సాఫ్ట్ డ్రింక్ కంపెనీ చైర్మెన్ అరీజ్ ఫిరోజ్షా కంబట్టా ఇవాళ కన్నుమూశారు. రస్నా గ్రూపు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఫిరోజ్షా కంబట్టా వయసు 85 ఏళ్లు. రస్నా ఫౌండేషన్తో పాటు అరీజ్ కంబట్టా బెనవోలెంట్ ట్రస్టుకు ఆయన చెర్మెన్గా ఉన్నారు. పార్సి ఇరానీ జార్తోస్టిస్ సంఘానికి చైర్మెన్గా చేశారు. భారతీయ పరిశ్రమలు,వ్యాపారానికి కంబట్టా ఎంతో సహకరించినట్లు రస్నా గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. సమాజ సేవ ద్వారా సామాజిక మార్పు కోసం కంబట్టా ప్రయత్నించినట్లు తెలిపారు.
స్వదేశీ డ్రింక్ను రస్నా బ్రాండ్తో కంబట్టా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సుమారు 18 లక్షల రిటైల్ షాపుల్లో ఆ బ్రాండ్ ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. ప్రపంచంలోనే సాఫ్ట్ డ్రింక్ను తయారు చేస్తున్న అతిపెద్ద కాన్సెంట్రేట్ మాన్యుఫాక్చరర్గా రస్నా సంస్థ నిలుస్తుంది.
సుమారు 60 దేశాల్లో రస్నా అమ్ముడుపోతోంది. బెవరేజ్ సెగ్మెంట్లో ఆ ఉత్పత్తి మార్కటె్ లీడర్గా ఉంది. 1970ల్లో రస్నా సాఫ్ట్ డ్రింక్ ప్యాకెట్లను క్రియేట్ చేశారు ఫిరోజ్షా కంబట్టా. అయిదు రూపాయల రస్నా ప్యాకెట్ ద్వారా సుమారు 32 గ్లాసుల సాఫ్ట్ డ్రింక్లను తయారు చేయవచ్చు. 1980, 90 దశకాల్లో ఐ లవ్ యూ రస్నా యాడ్ ఎంతో ఫేమస్.