లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో ఆహార సంస్థల యజమానుల పేర్లు ప్రదర్శించాలని బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై వివాదం చెలరేగుతున్నది. ముస్లింల వ్యాపారాలను గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ ఉత్తర్వు ఉద్దేశమని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో యోగా గురువు బాబా రామ్దేవ్ (Ramdev) దీనిపై స్పందించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను ఆయన సమర్థించారు. ‘తన గుర్తింపును వెల్లడించడంలో రామ్దేవ్కు ఇబ్బంది లేకపోతే, ఆయన గుర్తింపును వెల్లడించడంలో రెహమాన్కు ఎందుకు ఇబ్బంది?’ అని ప్రశ్నించారు.
కాగా, ప్రతి ఒక్కరూ తమ పేరు గురించి గర్వపడాలని, పేరును దాచాల్సిన అవసరం లేదని బాబా రామ్దేవ్ తెలిపారు. ‘పనిలో స్వచ్ఛత మాత్రమే అవసరం. మన పని స్వచ్ఛమైనది అయితే, మనం హిందువులమైనా, ముస్లింలమైనా లేదా మరే ఇతర వర్గానికి చెందినవారమైనా పట్టింపు లేదు’ అని అన్నారు.
#WATCH | Haridwar: On ‘nameplates’ on food shops on the Kanwar route in Uttar Pradesh, Yog Guru Baba Ramdev says, “If Ramdev has no problem in revealing his identity, then why should Rahman have a problem in revealing his identity? Everyone should be proud of their name. There is… pic.twitter.com/co47Ki6CrJ
— ANI (@ANI) July 21, 2024