కోల్కతా: రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద(95) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం రాత్రి 8.14 గంటలకు ఆయన కన్నుమూసినట్టు రామకృష్ణ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 29న అనారోగ్యంతో ఆయన దవాఖానలో చేరారు. రామకృష్ణ మిషన్, మఠానికి ఆయన 16వ అధ్యక్షులు. 2017లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.